వరద బాధితులకు రామోజీ గ్రూప్ భారీ విరాళం! లక్షల మంది అభాగ్యుల జీవనాన్ని..
Thu Sep 05, 2024 12:12 Helping Hand, Indiaవరదల విధ్వంసంతో సర్వస్వం కోల్పోయి.. సాయం కోసం ఎదురుచూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవాలని 'రామోజీ గ్రూపు' నిర్ణయించింది. వరద బాధితుల సహాయార్ధం రామోజీ గ్రూపు తరపున రూ.5 కోట్ల విరాళాన్ని 'ఈనాడు సహాయనిధి' ద్వారా అందిస్తున్నట్లు ఉషోదయా పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్.కిరణ్ ప్రకటించారు. ఆకస్మికంగా వచ్చిపడ్డ ఈ వరదలు ఊళ్లను, కాలనీలను తుడిచిపెట్టి.. లక్షల మంది అభాగ్యుల జీవనాన్ని తలకిందులు చేశాయి. ప్రకృతి ప్రకోపానికి మరెన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి.
ఇంకా చదవండి: నటి కాదంబరీ జత్వానీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు! ఈ కేసుపై మీడియాలో డిబేట్లు!
జలవిలయంతో నడిరోడ్డున పడ్డ బాధితులకు ఈ విపత్కర సమయంలో చేయూతను అందించాలన్న బృహత్ సంకల్పానికి 'ఈనాడు' శ్రీకారం చుట్టింది. ఈ మానవతా యజ్ఞంలో చేతులు కలపాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తోంది. 'ఈనాడు సహాయనిధి' ద్వారా అందించే సాయం.. సర్వం కోల్పోయిన బాధితుల జీవితాలకు ఆశాకిరణం అవుతుంది. ప్రకృతి కూల్చిన వారి ఆవాసాలను, మనోనిబ్బరాన్ని తిరిగి నిలబెడుతుంది. ఈ సంక్షోభ సమయంలో చేయి చేయి కలిపి.. బాధితులకు భరోసా కల్పించడానికి ముందుకు రావాలని ఈనాడు సహాయనిధి పిలుపునిస్తోందని, విరాళాలను కింది బ్యాంకు ఖాతాకు పంపవచ్చని సీహెచ్.కిరణ్ కోరారు.
ఇంకా చదవండి: ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్! ఎందుకో తెలుసా?
ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!
ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!
గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని పవన్ కల్యాణ్.. కారణమెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!
ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!
తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?
ప్రియురాలిని కలవడానికి బురఖాలో వెళ్లిన యువకుడు.. చివరికి జరిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!
నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!
విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!
ప్రభాస్, అల్లు అర్జున్ ఉదారత.. భారీ విరాళాలు ప్రకటించిన స్టార్స్! ఎంతో తెలుసా?
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.