కోల్‌కతా డాక్టర్‌ పోస్ట్‌మార్టం రిపోర్ట్ మాయం! సర్కార్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం!

Header Banner

కోల్‌కతా డాక్టర్‌ పోస్ట్‌మార్టం రిపోర్ట్ మాయం! సర్కార్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం!

  Mon Sep 09, 2024 21:33        India

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో గత నెల ఓ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపగా.. ఈ కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా తాజా విచారణ వేళ.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. విచారణ సందర్భంగా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌ అయినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శవపరీక్షకు సంబంధించి కీలక పత్రాలు కనిపించకుండాపోయిన ఘటనపై వివరణ ఇవ్వాలని బెంగాల్ సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది.

 

ఇంకా చదవండిగవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం చంద్రబాబు! వరద పరిస్థితులు, సహాయక చర్యలపై వివరణ! 

 

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌‌తోపాటు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పోస్టుమార్టం కోసం బాధితురాలి మృతదేహంతోపాటు ఆమె దుస్తులను కూడా పంపించారా అనే ప్రశ్న తలెత్తింది. ఈ క్రమంలోనే స్పందించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. పోస్ట్‌మార్టం కోసం అవసరమైన కీలక పత్రాల గురించి ఆరా తీశారు. శవపరీక్ష కోసం మృతదేహంతో పాటు ఏమేమి పంపించారో అనేది సంబంధిత చలాన్‌లోని కాలమ్‌లో సదరు కానిస్టేబుల్‌ నింపాల్సి ఉంటుందని తెలిపారు. ఆ పత్రం లేకుండా శవపరీక్ష నిర్వహించలేరని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను ఉద్దేశించి సీజేఐ అన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

కానీ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పోస్ట్‌మార్టం నివేదికలో ఈ చలాన్‌ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ధర్మాసనం గుర్తించింది. ఒకవేళ అది కనిపించకుండా పోతే అలా ఎందుకు జరిగిందో అనేది మంగళవారంలోగా వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌‌ను కోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించిన కపిల్ సిబల్.. ఆ చలాన్‌ను కోర్టుకు సమర్పిస్తామని.. అయితే దానికి కొంత సమయం కావాలని కోరారు.

 

ఇంకా చదవండిజగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోవైపు.. బాధితురాలు మృతి చెందిన 14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపైనా సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఘటన జరిగిన తర్వాత అంత ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నివేదికను సెప్టెంబర్ 17వ తేదీ లోగా సమర్పించాలని సీబీఐకి సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాధితురాలి ఫొటోలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #India #WestBengal #RGKARHospital #Kolkata