కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన!

Header Banner

కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన!

  Thu Jun 20, 2024 18:18        Politics

బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళనకు లోకేష్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 

అమరావతి: అనునిత్యం ప్రజల కోసం పరితపించే నాయకుడు ఒకవైపు... కూల్చివేతలు, విధ్వంసంతో పాలన ప్రారంభించిన నేత మరో వైపు... యువనేత లోకేష్, మాజీ సిఎం జగన్ నడుమ స్పష్టమైన వ్యత్యాసాన్ని రాష్ట్రప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించాక ప్రజావేదిక కూల్చివేతతో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు నాటి ముఖ్యమంత్రి జగన్. ప్రజలకు సేవ చేయాలంటే కేవలం అధికారం మాత్రమే సరిపోదు... మంచి చేయాలన్న మనసు కూడా ఉండాలి.

 

ఇంకా చదవండివైసీపీ ఎదురుదెబ్బలు మొదలు! టీడీపీ గూటికి చలమలశెట్టి? రహస్యాలు తెలియజేయునన్నారా?

 

సచివాలయంలో బాధ్యతలు చేపట్టకముందే పేద విద్యార్థుల కష్టాల గురించి ఆలోచించారు యువనేత నారా లోకేష్. ఈనెల 15వతేదీన తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన తొలి సమీక్షలో ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదని తెలుసుకున్న మంత్రి లోకేష్... పుస్తకాల్లేకుండా విద్యార్థులు ఎలా చదువు కొనసాగిస్తారని ప్రశ్నిస్తూ తక్షణమే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పాటు బ్యాక్ ప్యాక్ కూడా అందించాలని ఆదేశించారు. ఇందుకోసం రూ.33కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలుపగా, ఎంత ఖర్చయినా పర్వాలేదు, విద్యార్థులకు తక్షణమే పుస్తకాలు, కిట్స్ అందించాలని అన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ మేరకు 3రోజుల్లోనే జిఓ నెం.28ని విడుదల చేసి, త్వరలో పుస్తకాల పంపిణీకి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ కారణంగా యువత జీవితాలు నాశనమవుతున్న విషయాన్ని యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూసిన లోకేష్... పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో గంజాయి, డ్రగ్స్ వాడకం ఉక్కుపాదం మోపేలా విద్యా, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్కారీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలకు గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిలిపివేయగా, ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని లోకేష్ ఆదేశించారు.

 

ఇంకా చదవండిఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్మును వాడుకుంది చాలు! తిరిగి ఇచ్చేయాలి! ఫర్నీచర్ కోసం జగన్ కు జీఏడీ లేఖ! 

 

ఉపాధ్యాయులకు అనవసరమైన పనిభారాన్ని తగ్గించి కేవలం బోధనపై మాత్రమే దృష్టిసారించి విలువలతో కూడిన విద్య అందించేలా చర్యలు చేపడుతున్నారు. గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా తయారైన మధ్యాహ్న భోజన పథకాన్ని సమూల ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించారు. సరస్వతీ నిలయాలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలను జగన్ పాలనలో నీచరాజకీయాలకు నిలయంగా మార్చారు. అయిదేళ్లలో భ్రష్టుపట్టిన యూనివర్సిటీలను సమూలంగా ప్రక్షాళన చేసి, జాతీయ స్థాయి ర్యాంకింగ్స్ లో పైకి తీసుకువెళ్లడానికి మంత్రి లోకేష్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకొని సాధ్యమైనంత త్వరగా ఖాళీలను భర్తీచేయడానికి కసరత్తు చేస్తున్నారు.

 

ఇంకా చదవండిటీవీ9 రజినీకాంత్ కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం! ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు! 

 

గతప్రభుత్వ హయాంలో మూసేసిన స్కూల్స్ ను తెరిపించి పేద విద్యార్థులకు విద్యను దగ్గర చేయాలని సంకల్పించారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా పరిష్కరించి కాలేజీల్లో నిలచిపోయిన సర్టిఫికెట్లను విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మనసుంటే మార్గం లేకపోదన్న నానుడిని నిజం చేస్తూ బాధ్యతలు స్వీకరించకముందే విద్యాశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. అనుకున్న పని పూర్తయ్యేవరకు వెంటపడటం లోకేష్ నైజం. ఈ విషయాన్ని పసిగట్టిన అధికారులు ఆయన ఆలోచనలకు తగ్గట్లుగా సకాలంలో పనులు పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి 

నీతులు చెప్తున్న బూతుల మంత్రి నాని! కూటమికి 6 నెలలు సమయం ఇస్తారంట! ఎందుకు అన్నీ సర్దుకొని పారిపోవడానికా? 

 

కలకలం రేపుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలుసా! 

 

రుషికొండ దోపిడీపై విచారణ జరుపుతాం! లోకేష్ ఘాటు వ్యాఖ్యలు! 

 

టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే ఇంజిన్ లో మంటలు! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! 

 

ఆ కారణం వల్లనే నాకు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కింది! ఇది జగన్ పై ప్రజలు తిరుగుబాటు! 

 

NTA సంచలన నిర్ణయం! UGC-NET రద్దు! సీబీఐ విచారణ! 

 

తమిళనాడులో కల్తీ మద్యం కలకలం! 10 మంది మృతి! అధికారులపై బదిలీ వేటు!

 

హజ్ యాత్రలో తీవ్ర విషాదం! 550 మృతి! కారణం అదే!

 

మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్! బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్!

 

ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆ పేర్లు ఉండవు! వెంటనే అమలు! 

                                                                                                                          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #YCP #NaraLokesh #YSJagan #AndhraPradesh #APPolitics #APGovernment