రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. పట్టపగలే నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి చంపాడు! దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమిటిరా?

Header Banner

రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. పట్టపగలే నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి చంపాడు! దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమిటిరా?

  Fri May 31, 2024 10:55        India

ప్రేమోన్మాదంతో రెచ్చిపోయిన యువకుడు ఓ యువతిని నడి రోడ్డు మీద దారుణంగా నరికి హత్య చేశాడు. ఆపై తనూ గొంతు కోసుకున్నాడు. ఏలూరులో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సత్రంపాడు ఎంఆర్‌సీ కాలనీలో నివాసముంటున్న జక్కుల రామారావుకు ఇద్దరు భార్యలు, రెండో భార్య రాజ్యలక్ష్మి, రామారావులకు ఏకైక కుమార్తె రత్నాగ్రేస్ అలియాస్ స్వీటీ (23) డిగ్రీ పూర్తి చేసింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. రత్నాగ్రేస్ డిగ్రీ చదువుతున్నప్పుడు ముసునూరుకు చెందిన కట్టుబోయిన ఏసురత్నం పరిచయమయ్యాడు. ఆ తరువాత తనను ప్రేమించాలంటూ అతడు యువతి వెంటపడటం మొదలుపెట్టాడు. 2023లో వీరి చదువు పూర్తయ్యింది. ఆ తరువాత కూడా ఏసురత్నం అప్పుడప్పుడూ ఏలూరు వచ్చి రత్నా గ్రేస్ ‌ను ప్రేమించాలంటూ వేధించేవాడు. కొద్ది రోజుల క్రితం ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో, వారు ఏసురత్నం తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు.

 

ఇంకా చదవండి: ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!

 

అతడిని మందలించారు. మరోవైపు, ఈ నెల 26న రత్నాగ్రేస్ కు నిశ్చితార్థమైంది. జూన్ 16న వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలిసిన ఏసురత్నం ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనుకున్నాడు. అది కుదరకపోతే ఆమె ఇంకెవరికీ దక్కకూడని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో రత్నా గ్రేస్ గురువారం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం తను పనిచేసే స్కూలు పక్కనే ఉన్న బ్యాంకు వద్దకు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లింది. అక్కడ అప్పటికే ఉన్న ఏసురత్నం తననే పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. తనకు పెళ్లి నిశ్చయమైందని రత్నాగ్రేస్ చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు తన బ్యాగులోని కత్తిని తీసి.. తనను చంపమంటూ ఆమె చేతికిచ్చాడు. దీంతో ఆమె అతడిని వారించింది. ఇంతలో ఏసురత్నం ఒక్కసారిగా ఆమె మెడపై విచక్షణా రహితంగా నరికాడు. దీంతో, ఆమె తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తరువాత ఏసురత్నం కూడా తన గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావమై అతడూ మూర్ఛపోయాడు. అటుగా వెళుతున్న పోలీసులు వారిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు.  ఏసురత్నం పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్ గా ఉంది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Eluru #CrimeNews #AndhraPradesh