46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

Header Banner

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

  Wed Jul 10, 2024 17:30        India

పూరీ జగన్నాథుడి భాండాగారం దాదాపు 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకోనుంది. స్వామికి చెందిన విలువైన ఆభరణాలను లెక్కించేందుకు భాండాగారం తలుపులు తెరవనున్నారు. లోపల ఐదు పెట్టెలలో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు, వాటి విలువ మదింపు సహా భాండాగారం మరమ్మతులు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆలయ ఖజానా లెక్కింపుపై ఏర్పాటు చేసిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ మంగళవారం భేటీ అయింది. ఈ నెల 14న ఆలయ భాండాగారం తెరిచి, ఆభరణాలను లెక్కించాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో ప్రభుత్వానికి ఆ తీర్మానం పంపగా.. ఖజానా లెక్కింపునకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టరేట్‌ ట్రెజరీలో ఉన్న తాళంచెవితో తెరుచుకోకపోతే తాళంకప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి: అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఫిర్యాదు! సోషల్ మీడియాలో కించపరిచేలా!


ఒడిశాలోని పూరీ జగన్నాథుడికి చెందిన విలువైన ఆభరణాలను ఆలయంలోని ఓ రహస్య గదిలో భద్రపరిచారు. గతంలో మూడేళ్లు, ఐదేళ్లకు ఒకసారి గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో ట్రెజరీలోని వజ్రాభరణాలను లెక్కించి భాండాగారం సీజ్ చేశారు. అప్పటి నుంచి మళ్లీ ఆ గది తెరవలేదు. అయితే, అప్పుడు కూడా కొన్ని ఆభరణాలను వెలకట్టలేక పక్కన పెట్టారని, గది తాళం దొరకడంలేదని.. ఇలా ఆలయ భాండాగారం చుట్టూ పలు వివాదాలు రేగాయి. అప్పటి నుంచి మళ్లీ ఈ గదిని తెరవలేదు. ఒడిశాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇది కూడా కీలక అంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఆలయ భాండాగారం తెరిచి, జగన్నాథుడి సంపదను లెక్కిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకునే క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భాండాగారం తెరిచేందుకు ఈ నెల 14 ను ముహూర్తంగా నిర్ణయించింది. 



అప్పట్లో లెక్కింపుకు 70 రోజులు..
1978లో భాండాగారంలోని సంపద లెక్కించేందుకు 70 రోజులు పట్టింది. లెక్కింపు తర్వాత ప్రకటించిన జాబితాలో స్వామి వారికి చెందిన పలు ఆభరణాల పేర్లు కనిపించలేదు. దీనిపై హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. ఈ క్రమంలో ఆభరణాల లెక్కింపు, గది మరమ్మతుల కోసం 2019లో నవీన్ పట్నాయక్ సర్కారు 13 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 16న భాండాగారం తలుపు తెరిచేందుకు వెళ్లిన ఈ కమిటీ సభ్యులు.. తాళంచెవి కనిపించకపోవడంతో వెనుదిరిగారు. భాండాగారానికి సంబంధించిన డూప్లికేట్ తాళంచెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఈ తాళం చెవి సాయంతో గది తలుపులు తెరవనున్నారు.

 

ఇంకా చదవండి: రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బహ్రెయిన్ మరియు సౌదీలలో ట్రావెల్ రంగానికి చెందిన ఉద్యోగాల అవకాశం! ఆకర్షణీయమైన జీతం! వెంటనే అప్లై చేసుకోండి!

 

ఏపీపై ఆగ్రహంగా బంగాళాఖాతం? భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాతావరణ కేంద్రం అలర్ట్!

 

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఛార్జీల పెంపు! ఉన్నత విద్య కోసం వెళ్ళే విద్యార్థులకు భారీ షాక్!

 

ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!

 

మంత్రులతో కలిసి రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి! ఎందుకో తెలుసా?

 

మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు! 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి!

 

అమరావతి ORR వలన రాష్ట్ర ముఖచిత్రం ఏ విధంగా మారనున్నది! ప్రాజెక్టు పూర్తి విశేషాలు! జరగబోయే మార్పులు! ఆ ప్రాంతాల వారికి పండగే!

 

అమెరికాలో కాల్పుల మోత! ఇంటి యజమాని సహా నలుగురి మృతి! కాల్చింది ఎవరో కాదు సొంత కొడుకే! కారణం?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #PuriJagannadh #RatnaBhandar #Opening #Gold #Dimond #ornaments #Lordjagannath