అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి!

Header Banner

అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి!

  Wed Jul 10, 2024 10:47        Politics

అధికారంలో ఉండగా వీరావేశం ప్రదర్శించారు. తోటి నాయకులపై తొడకొట్టారు. తమకు ఎదురు లేదని, ఎవరూ పోటీ రారని బీరాలు పలికారు. అధి నాయకుల మెప్పుకోసం మీసాలు మెలేశారు. అధికారం పోయింది. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో అడ్రస్ లేరు. అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో లీడర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. కేసుల భయంతో ఇతర ప్రాంతాలకు వెలుతున్న నేతలు కోర్టుల ద్వారా ఉపశమనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో గందరగోళం నెలకొంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, యువజన విభాగం కోఆర్డినేటర్ పిన్నెల్లి వెంకట్రామి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్, విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య ఇలా చెప్పుకుంటే పోతే ఎంతో మంది నేతలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ నేతలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పదిహేడు నియోజకవర్గాల్లో వైసిపి నేతలు ఓడిపోయారు. మొట్టమొదటి సారి కూటమి అభ్యర్థుల క్లీన్ స్వీప్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు ధైర్యం చెప్పి ముందుండి నడింపించాల్సిన నేతలు తలో దిక్కుకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు లేకపోతే కనీసం ఎమ్మెల్సీలైనా అండగా ఉంటారనుకుంటే వారు కూడా అందుబాటులో లేకపోవడం కార్యకర్తలను మరింతగా కుంగదీస్తోంది.

 

ఇంకా చదవండి:  రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!

 

కేసుల భయంతోనే ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామష్టారెడ్డిని అరెస్ట్ చేడయంతోనే ఇతర నేతల్లో ఆందోళన మొదలైంది. పిన్నెల్లి అరెస్టై రిమాండ్ లో ఉన్నా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎక్కడున్నది ఇంతవరకూ తెలియదు. పిన్నెల్లి బ్రదర్స్ తో పాటు వారి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్ కూడా అజ్నాతంలోకి వెళ్లిపోయారు. కిషోర్ పై అనేక కేసులున్నాయి. పంచాయితీ ఎన్నికల సమయంలో టిడిపి నేతల కారుపై దాడి చేసిన నిందితుల్లో కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారటంతోనే ఆ కేసుల్లో అరెస్ట్ చేస్తారన్న భయంతో వెంకట్రామిరెడ్డి, కిషోర్ ఇద్దరూ కూడా విదేశాలకు వెళ్లిపోయారని అనుకుంటున్నారు.

 

ఇంకా చదవండి: భోగాపురంపై చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా దృష్టి! ఎయిర్ పోర్టు పనులు పూర్తవుతాయని..రామ్మోహన్

 

ఇక కేంద్ర టిడిపి కార్యాలయంపై జరిగిన దాడి కేసు గుంటూరు నేతల్ని వెంటాడుతోంది. దాడుల్లో పాల్గొన్నారంటూ పలువురి కేసు నమోదు చేయడమే కాకుండా ప్రభుత్వం సిట్ కూడా వేసింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అప్పి రెడ్డి ప్రస్తుతం అజ్నాతంలో ఉన్నాడు. దాడిలో పాల్గొన్న విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య కూడా ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి చైతన్య గుంటూరులో కనిపించడం లేదు. వీరితో పాటు పలువురు కార్పోరేటర్లు, కార్పోరేటర్ల భర్తలు కూడా గుంటూరు వదిలి వెళ్లిపోయారు. కార్పోరేటర్ రోషన్, గురవయ్యలతోపాటు కార్పోరేటర్లు భర్తులు రమేష్, రాజేష్ లు ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పటికే కార్పోరేటర్ అంచాల వెంకటరెడ్డి టిడిపి కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసిపి నేతలతో పాటు కార్యకర్తల్తోనూ కేసులు భయం వెంటాడుతోంది. అయితే న్యాయ పోరాటం చేయకుండా ఎన్నాళ్లు దాక్కుంటారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి 

కెనడాలో ఆకాశాన్ని అంటుతున్న ఇళ్ల అద్దెలు! భారతీయులకు తిప్పలు! కారణం ఏంటంటే? 

 

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్! నలుగురు తెలుగువారు అరెస్ట్! 

 

మాజీ షీఎం జగన్ కు టిడిపి బంపర్ ఆఫర్! ఏంటో తెలుసా!

 

విజయవాడలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా! చ‌ర్య‌ల‌కు ఆదేశం!

   

ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త! తిరుపతిలో జాబ్ ఆఫర్స్! వెంటనే అప్లై చేసేయండి!

                   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #CBN #CBNAgain #YSJagan #Pinnelli #Palnadu #Macherla