ఆ షిఫ్టుల్లో పనిచేసే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ! నిపుణులు ఏం చెప్తున్నారంటే!
Fri Sep 13, 2024 15:23 Life Styleనేటి కార్పొరేట్ సంస్కృతిలో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి షిఫ్ట్ చేయవలసి వస్తుంది. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య, కాల్ సెంటర్లు వంటి కొన్ని సేవలు ఉన్నాయి. అందుకే అక్కడ పనిచేసే వారు నైట్ షిఫ్ట్ కూడా చేయవలసి వస్తుంది. అయితే మన శరీరం పగటిపూట పని చేయడానికి, రాత్రి నిద్రించడానికి ఎక్కువగా అలవాటు పడి ఉంటుంది.
అయితే JAMA జర్నల్లోని ఒక పరిశోధన ప్రకారం రాత్రిపూట పని చేయడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఇతర మహిళల కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు పరిశోధకులు. ఈ పరిశోధన ప్రకారం 24 గంటల సమయంలో శరీరం చేసే పనుల్లో అంతరాయం కలిగించడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణితులు ఏర్పడే అవకాశాలు అధికం అంటున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రేడియేషన్ ఆంకాలజిస్ట్ ల అభిప్రాయం ప్రకారం నైట్ షిఫ్ట్ కార్మికులలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో మొదటిది మెలటోనిన్ ఉత్పత్తి కాకపోవడం. ఇది ఒక రకమైన హార్మోన్. ఇది రాత్రి నిద్రపోయేటప్పుడు శరీరంలో ఉత్పత్తి అవుతుంది. కానీ రాత్రి నిద్రపోకపోవడం వల్ల శరీరంలో ఉత్పత్తి అవ్వదు. ఇది క్యాన్సర్కు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ హార్మోన్ శరీరంలో క్యాన్సర్ను నివారించడంలో సహాయపడుతుంది. దీని కారణంగా శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడవు. ఈ హార్మోన్ కణితుల అభివృద్ధికి సంబంధించిన జన్యువులను కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల రాత్రిపూట నిద్రపోవడం చాలా ముఖ్యం. అయితే రాత్రి నిద్రలేవగానే, దాని ఉత్పత్తి ఆగిపోతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇంకా చదవండి: మాజీ మంత్రికి మరింత బిగుస్తున్న ఉచ్చు! ఏసీబీ పిటీషన్లపై విచారణ వాయిదా!
అలాగే రాత్రంతా మెలకువగా ఉండేందుకు చాలామంది ధూమపానాన్ని ఆశ్రయిస్తారు. రాత్రి షిఫ్టులలో పనిచేసే వ్యక్తులు పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువగా పొగ తాగడం వల్ల నిద్రపోకుండా ఉండడం గమనించారు. అధిక ధూమపానం కూడా శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందువల్ల అధిక ధూమపానం క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
అలాగే పగటిపూట పనిచేసే వారి కంటే రాత్రిపూట పనిచేసేవారు జంక్ ఫుడ్, శీతల పానీయాలు, కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటారని వైద్యులు చెబుతున్నారు. పగటిపూట ప్రజలు పండ్లు, సలాడ్లు, మొలకలు తింటారు. రాత్రిపూట పనిచేసే వ్యక్తులు ఉప్పుతో కూడిన స్నాక్స్, పిజ్జా, బర్గర్లు, కోలా మొదలైన వాటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలను పెంచుతుంది. దీనితో పాటు క్యాన్సర్ కూడా వస్తుంది.
ఇంకా చదవండి: టోల్ గేట్లలో కీలక మార్పులు! ఇక ఆ వాహనదారులకు చార్జీలు ఉండవు!
రాత్రి షిఫ్ట్ కారణంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుండగా, పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ దాని కేసులు చాలా చివరి దశలో, చాలా పెద్ద వయస్సులో కనిపిస్తాయి. అయితే ఇతర క్యాన్సర్లతో నైట్ షిఫ్ట్కు సంబంధం ఇంకా కనుగొనబడకపోవడం ఉపశమనం కలిగించే విషయం.
నైట్ షిఫ్ట్ ఉంటే దాన్ని వదిలేసి డే డ్యూటీని చేయడానికి ప్రయత్నించండి. ఇది సాధ్యం కాకపోతే, రాత్రి షిప్టుల్లో పని మధ్య విరామం తీసుకోండి. రాత్రిపూట కాఫీ, టీలు ఎక్కువగా తాగకూడదు. రోజూ వ్యాయామం చేయండి, మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!
కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడికి కీలక పదవి! తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం!
18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!
ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!
గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉద్యోగులపై కేసు!
గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #LifeStyle #Health #Cancer #Jobs #Employees
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.