ఎట్టకేలకు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన 5-డోర్ మహీంద్రా థార్! ధర ఎంతో తెలుసా!

Header Banner

ఎట్టకేలకు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన 5-డోర్ మహీంద్రా థార్! ధర ఎంతో తెలుసా!

  Thu Aug 15, 2024 22:15        Auto

దేశంలో థార్ మోడల్ లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 5 డోర్ మహీంద్రా థార్ దేశీయ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ కొత్త మోడల్ పేరు 'మహీంద్రా థార్ రోక్స్'. ఇది పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో వచ్చింది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.12.99 లక్షలు. డీజిల్ మోడల్ ధర రూ.13.99 లక్షలు. స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ, బ్యాటిల్షిప్ గ్రేయు బర్న్స్ సియెన్నా కలర్స్ లో లభిస్తుంది.

 

గతంలో నాలుగు సంవత్సరాల క్రితం ఆగస్టు 15, 2020న థార్ 3-డోర్ SUVని తీసుకొచ్చారు. ఈ మోడల్ రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. అయితే ఇది 3 డోర్లు కలిగి ఉండటంతో వినియోగదారులు 5 డోర్ కలిగిన థార్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఈ మోడల్ గురించి ఆన్లైన్లో కొన్ని లీక్లలు రావడంతో దీనిపై వినియోగదారులకు మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు 5-డోర్ థార్ లాంచ్ కావడంతో అమ్మకాల పరంగా ఈ మోడల్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

ఇంకా చదవండివిద్యార్థులకు గుడ్ న్యూస్! ఉచితంగానే రూ. 48 వేలు - అదిరిపోయే స్కీమ్! ఏ తరగతి నుంచి అంటే - ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గతంలో వచ్చిన 3 డోర్ మోడల్ కంటే మరింత అధునాతన సస్పెన్షన్ సెటప్ తో వచ్చింది. 2.0L టర్బో-పెట్రోల్ ఇంజన్ 160bhp పవర్, 330Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 2.2L టర్బో-డీజిల్ వేరియంట్ 150bhp పవర్, 330Nm టార్క్ ను అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్, ఆటో మెటిక్ గేర్ బాక్స్ను కలిగి ఉన్నాయి.

 

LED టైలైట్లు, బంపర్ పై ఫాగ్ ల్యాంప్లు, లోపల 10.25-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, AC వెంట్లు, USB టైప్-సి చార్జింగ్ పోర్ట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సట్రూఫ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగ్ లు, ESC ఇంకా మరిన్ని ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. బుకింగులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. దసరా నుంచి డెలివరీలు చేస్తారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటేవీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

 

వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!

            

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AutoMobiles #MahindraThar #AndhraPradesh