అమెరికాలో మరో విషాదం! ఘోర రోడ్డు ప్రమాదం! ఏపీ విద్యార్ధి...

Header Banner

అమెరికాలో మరో విషాదం! ఘోర రోడ్డు ప్రమాదం! ఏపీ విద్యార్ధి...

  Sun Jul 21, 2024 21:29        U S A

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్లహామాలోని నేషనల్ హైవేపై మూడు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏపీకి చెందిన విద్యార్థిని హారిక దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన విద్యార్థిని హారిక ఏపీ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి వాసిగా గుర్తించారు. అమెరికాలో వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం ఏడాదిన్నర క్రితం అమెరికాకు వెళ్లారు. హారిక మృతి చెందిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు ఇండియన్ ఎంబసీ సమాచారం అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తమ కుమార్తె హారిక మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హారిక తండ్రి ఏపీ దేవాదాయ శాఖలో పని చేస్తున్నట్లుగా తెలిసింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్! వైఎస్ జగన్ సమావేశానికి ఐదుగురు ఎంపీలు డుమ్మా!

 

పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడతారా? హోం మంత్రి తీవ్ర ఆగ్రహం!

 

పెన్షన్ ల పంపిణీ పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ప్రతి నెలా ఆ తేదీన!

  

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

  

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

    

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants #RoadAccidents #TeluguStudent