28 ఏళ్ల క్రితం భారత్ నుంచి బహరేన్ కు వెళ్ళాడు! పాస్‌పోర్ట్, వీసా లేక జైలుపాలు!

Header Banner

28 ఏళ్ల క్రితం భారత్ నుంచి బహరేన్ కు వెళ్ళాడు! పాస్‌పోర్ట్, వీసా లేక జైలుపాలు!

  Thu Jul 11, 2024 13:14        Bahrain

మానువాడ నర్సయ్య (62) అనే వృద్ధుడు ప్రస్తుతం బహరేన్ జైలులో మగ్గుతున్నాడు. ఇతని పేరును బట్టి తెలంగాణ వ్యక్తిగా భావిస్తున్నారు. బహరేన్ ప్రభుత్వ సంస్థ 'లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ' (ఎల్ఎంఆర్ఏ) ఇన్స్పెక్షన్ మేనేజర్ 2024 జనవరి 8న బహరేన్ లోని భారత రాయబారికి ఒక లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మానువాడ నర్సయ్య పాస్‌పోర్ట్ అందుబాటులో లేదు, పోయినట్లు వెల్లడించారు. చట్టవిరుద్ధమైన స్థితిలో ఉన్నాడు. అతన్ని బహరేన్ నుంచి భారత్ కు పంపించడం (డిపోర్ట్) కోసం ఇండియన్ ఎంబసీ వారు 'అవుట్ పాస్' (తాత్కాలిక పాస్‌పోర్ట్) జారీ చేయాలని ఆ లేఖలో కోరారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

28 ఏళ్ల క్రితం... 1996 సెప్టెంబర్ 23న బహరేన్ దేశానికి చేరుకున్నప్పుడు మానువాడ నర్సయ్య వయస్సు 34 ఏళ్ళు. ది అరబ్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీలో మూడేళ్ళ పాటు తాపీ మేస్త్రీ గా పనిచేసి ఆగస్టు 1999 లో వర్క్ పర్మిట్ ముగిసినట్లు ఎల్ఎంఆర్ఏ రికార్డులలో తెలుస్తుంది. హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం వారు జి-374083 నెంబర్ తో మానువాడ నర్సయ్యకు 1989 సెప్టెంబర్ 22న పాస్‌పోర్ట్ జారీ చేశారు. దీని గడువు 1999 సెప్టెంబర్ 21న ముగిసింది.  

 

ఇంకా చదవండి: భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

 

ఈ విషయాన్ని బహరేన్ లోని సామాజిక కార్యకర్త నోముల మురళి, హైదరాబాద్ లోని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ద్వారా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి పాత రికార్డులను శోధించి (సెర్చ్) చేసి మానువాడ నర్సయ్య చిరునామా కనుక్కొని, సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ల ద్వారా నివేదిక తెప్పించి బహరేన్ లోని ఇండియన్ ఎంబసీకి పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ మేరకు టి. జీవన్ రెడ్డి సంబంధిత అధికారులకు 'ఎక్స్' ద్వారా ట్వీట్ చేశారు.

 

ఇవి కూడా చదవండి 

ఏపీ పోలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం! వల్లభనేని వంశీపై కేసు నమోదు! అరెస్టుకు రంగం సిద్ధం! 

 

ఆ విషయంలో కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన RRR! ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారు! 

 

ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ! 

 

'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' నెంబర్ ప్లేట్ తొలగించి... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు! 

  

పోలీసు కస్టడీలో పిన్నెల్లి రెండవరోజు విచారణ! ఏం చెప్పాడో తెలుసా!

   

ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్! 

  

అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి! 

                          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Bahrain #BahrainNews #BahrainUpdates #AndhraPradesh #Telangana #IndianMigrants #TeluguMigrants #Gulf #GulfNews #GulfCountries