వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు! నా పిల్లల వయసు 14, 16 సంవత్సరాలు! ఐపీఎల్ అయితే 2-3 నెలల్లో!

Header Banner

వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు! నా పిల్లల వయసు 14, 16 సంవత్సరాలు! ఐపీఎల్ అయితే 2-3 నెలల్లో!

  Fri Sep 06, 2024 09:22        Sports

టీమిండియా ప్రధాన కోచ్ పదవిని స్వీకరించడానికి తాను ఆసక్తిగా లేనని, దానికంటే ఐపీఎల్‌లో ఒక టీమ్‌కు కోచింగ్ బాధ్యతలు ఆఫర్ చేస్తే పరిశీలిస్తానని మాజీ దిగ్గజ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మనసులో మాట చెప్పాడు. ఇందుకు గల కారణాలను అతడు వివరించాడు. ‘‘ భారత క్రికెట్ జట్టు కోచ్‌గా కాకుండా ఐపీఎల్‌లో కోచింగ్ అవకాశం ఇస్తే తప్పకుండా పరిశీలిస్తాను. భారత జట్టు ప్రధాన కోచ్‌గా మారితే మళ్లీ రోటీన్ లైఫ్‌నే కొనసాగించాల్సి ఉంటుంది. భారత జట్టు కోసం మళ్లీ గత 15 ఏళ్లు మాదిరిగా ఉండాల్సి ఉంటుంది. ఏడాదిలో 8-9 నెలలు ఇంటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. నా పిల్లలు వయసులు 14, 16 ఏళ్లు. వారికి నేను సాయంగా ఉండాలి’’ అని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. తన కొడుకుల్లో ఒకరు ఓపెనింగ్ బ్యాటర్, మరొకరు ఆఫ్ స్పిన్నర్ అని సెహ్వాగ్ తెలిపాడు. తాను వారికి క్రికెట్‌ పరంగా సాయం చేయాలని, వారితో సమయం గడపాలని చెప్పాడు.

 

ఇంకా చదవండి: పారిస్‌లో అవని లేఖరా ‘బంగారు విజయం’! జీవిత సవాళ్లను ఎదుర్కొని చరిత్ర సృష్టించిన భారత స్టార్!

 

తాను టీమిండియా హెడ్ కోచ్ అయితే పిల్లలకు దూరంగా గడపడం తనకు అతిపెద్ద సవాలు అవుతుందని, అలా ఉండలేనని, అందుకే ఐపీఎల్‌లో కోచ్ లేదా మెంటార్ బాధ్యతలు అందుబాటులో ఉంటే తాను చేపట్టగలనని క్లారిటీ ఇచ్చాడు. ‘అమర్ ఉజాలా’ అనే హిందీ న్యూస్‌ పేపర్‌కు ఇంటర్వ్యూలో సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఎక్కువ కాలం ఇంటికి దూరంగా ఉండడం ఇష్టం లేక కోచ్ పదవీకాలం పొడిగింపు ఆఫర్‌ను తిరస్కరించారు. ఇక ఐపీఎల్ 2025 సీజన్‌లో తన మాజీ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌కు మెంటార్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ సంవత్సరానికి కేవలం 2-3 నెలలు మాత్రమే ఉండడంతో ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ద్రావిడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల్లో ఉంటే ఏడాదికి 10 నెలలు ఇంటికి దూరంగా గడపాల్సి ఉంటుందని అతడు చెప్పాడు. 

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!

 

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!

 

ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!

 

ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!

 

వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!

 

వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్‌! ఎందుకో తెలుసా?

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!

 

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #VirenderSehwag #Cricket #TeamIndia #IPLCricketNews